శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో జగన్ వర్గం ఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతి బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఆమె కాంగ్రెసులోకి వెళతారన్న వాదనలు జోరుగు వినిపించిన విషయం తెలిసిందే. ఆ వార్తలను ఆమె అప్పట్లో కొట్టి పారేసినప్పటికీ కాంగ్రెసులోనే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. సిఎం సభలో పాల్గొన్న ఆమె దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు సిఎం కిరణ్ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. తాను కాంగ్రెసును వీడేది లేదని స్పష్టం చేశారు. నువ్వులరేవు బ్రిడ్జి నిర్మాణంపై సిఎం హామీ ఇచ్చారని చెప్పారు.

కాగా అంతకుముందు రచ్చబండలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి మండలానికి ఓ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాబోయే పంచాయతీ, మండల ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కేటాయించనున్నట్లు చెప్పారు. మహిళలకు ఇచ్చే రుణాలు నేరుగా వారికే మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు మీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

English summary
YSR Congress Party MLA Korla Bharathi participated in CM Kiran Kumar Reddy meeting today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X