కాంగ్రెసు ఎమ్మెల్యేనే: జగన్ వర్గం భారతి మాట మారింది!
జగన్ ఆస్తులపై విచారణ నేపథ్యంలో ఆమె కొద్ది రోజులుగా నియోజక వర్గ కార్యకర్తలతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్లోనే ఉండాలంటూ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల కిందట హైదరాబాద్లో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కలిసిన భారతి పార్టీలోకి వచ్చేందుకు అనుమతి తీసుకున్నారని సమాచారం. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆమెను ఫోన్ ద్వారా ఆహ్వానించారట. ఈ పరిణామాల నేపథ్యంలో సొంతగూటికి చేరేందుకు ఆమె చకచకా పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది.
సోమవారం మధ్యాహ్నం ఆమె సన్నిహిత కార్యకర్తలతో జరిపిన సమావేశంలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే శ్రేయస్కరమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం వజ్రపుకొత్తూరులో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హాజరుకావాలని భారతి నిర్ణయించుకున్నారు. సిఎంకు తన సుముఖత తెలిపి 25వ తేదీ తరువాత లాంఛనంగా అధికార పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.