వైయస్ జగన్‌ను రానీయం: ఆనం వివేకానంద రెడ్డి

Anam Vivekananda Reddy
హైదరాబాద్: తమ పార్టీలోకి తిరిగి వస్తానంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించబోమని కాంగ్రెసు శానససభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కాంగ్రెసులోకి రాకపోవచ్చునని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు చేపలు ఏనాటికైనా సొంత సముద్రంలోకి రాక తప్పదని ఆయన అన్నారు. వైయస్ జగన్ బలం రోజు రోజుకీ తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ వెంట 30 మంది శానససభ్యులుంటే వారు ప్రస్తుతం 20 మందికి తగ్గారని, రేపటికి పదికి తగ్గవచ్చునని ఆయన అన్నారు. ఏడాది పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆటుపోట్లను ఎదుర్కుని సమర్థమైన పాలనను అందించారని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వైయస్ జగన్ వర్గం శానససభ్యులు కాంగ్రెసులోకి వస్తారని మంత్రి పి. శంకరరావు విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై త్వరలో ప్రకటన వస్తుందని, తెలంగాణ కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+