హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను రానీయం: ఆనం వివేకానంద రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
హైదరాబాద్: తమ పార్టీలోకి తిరిగి వస్తానంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించబోమని కాంగ్రెసు శానససభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కాంగ్రెసులోకి రాకపోవచ్చునని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు చేపలు ఏనాటికైనా సొంత సముద్రంలోకి రాక తప్పదని ఆయన అన్నారు. వైయస్ జగన్ బలం రోజు రోజుకీ తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ వెంట 30 మంది శానససభ్యులుంటే వారు ప్రస్తుతం 20 మందికి తగ్గారని, రేపటికి పదికి తగ్గవచ్చునని ఆయన అన్నారు. ఏడాది పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆటుపోట్లను ఎదుర్కుని సమర్థమైన పాలనను అందించారని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వైయస్ జగన్ వర్గం శానససభ్యులు కాంగ్రెసులోకి వస్తారని మంత్రి పి. శంకరరావు విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై త్వరలో ప్రకటన వస్తుందని, తెలంగాణ కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని ఆయన అన్నారు.

English summary
Congress MLA Anam Vivekananda Reddy said that YSR Congress party president YS Jagan may not return to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X