ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయన కాంగ్రెసు నేత: వైయస్ ఫోటో ఆందోళనపై సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ నేత అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఖమ్మం జిల్లా రచ్చబండ కార్యక్రమంలో అన్నారు. ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలోని ఓ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు వైయస్సార్ అభిమానులు వేదికపై వైయస్ బొమ్మ లేకపోవడంతో ఆందోళనకు దిగారు. కిరణ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. వైయస్ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఆయన ఎప్పటికీ కాంగ్రెసు నేతే అన్నారు. ఆయన అశయాలను కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో పదిలక్షల ఎకరాలకు బోర్లు, ఇరిగేషన్ ప్లాంట్లు, ఇందిర జల ప్రభ పథకాలతో సాగుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 29 మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం చెప్పారు. ఇందుకోసం రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మోడల్ పాఠశాలల్లోనే జూనియర్ కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కాగా చంద్రుగొండ మండలం కొండాయిగూడెంలో సిఎం ఇందిర జలప్రభ పథకాన్ని ప్రారంభించారు.

English summary
CM Kiran Kumar Reddy clarified that late YS Rajasekhar Reddy is Congress Party leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X