ప్రణబ్‌ మాటలు వినేది లేదు: తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు

Pranab Mukherjees
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాటలను తాము వినేది లేదని, ఈ విషయం ప్రణబ్ ముఖర్జీకి స్వయంగా చెప్పామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పారు. అధికార పార్టీ సభ్యులుగా లోకసభ సమావేశాలను అడ్డుకోవద్దని ప్రణబ్ ముఖర్జీ చెప్పారని, 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనను అమలు చేయాలని, అంత వరకు తాము నిరసనను కొనసాగిస్తామని చెప్పామని వారన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, మందా జగన్నాథం గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమపై చర్యలు తీసుకున్నా భయపడేది లేదని, తాము దేనికీ భయపడబోమని వారు చెప్పారు. తాము ప్రతి రోజు నిరసన తెలియజేస్తామని, ఆ నిరసన కార్యక్రమ రూపాన్ని ఓ రోజుకా రోజు ప్రకటిస్తామని వారు చెప్పారు. తమను అవమానిస్తే తమ ప్రజలను అవమానించినట్లేనని వారన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని తాము ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు వారు తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని తాము ముందే చెప్పామని, అదే చేశామని వారన్నారు. తెలంగాణ ఆకాంక్షను మూడు రోజులుగా పార్లమెంటులో ప్రతిబింబింపజేస్తున్నామని, ఇక ముందు కూడా కొనసాగిస్తామని వారు చెప్పారు. అధికార పార్టీ ఇచ్చిన హామీని 700 మంది ప్రాణత్యాగాల నేపథ్యంలోనైనా అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం అసంభవమని వారన్నారు. తమను నియంత్రించడానికి ప్రయత్నిస్తే రెట్టింపుగా ఎదిరిస్తామని వారన్నారు. తమను నియంత్రించవచ్చు గానీ ప్రజలను నియంత్రించలేరని వారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+