శానససభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: చంద్రబాబు

Chandrababu Naidu
విశాఖపట్నం: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లాలో రైతు పోరు బాటను ముగించుకుని హైదరాబాదు బయలుదేరే ముందు ఆయన శుక్రవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై పెట్టిన కేసులు దురుద్దేశపూరితమైనవని ఆయన విమర్శించారు. తమ వాదనలు వినకుండానే సిబిఐ విచారణకు ఆదేశించడం సమంజసం కాదని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సమర్థులను పోటీకి దించుతామని ఆయన చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 294 స్థానాలు కూడా తమవేనని ఆయన దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు హైదరాబాదు వచ్చిన తర్వాత తాను హైకోర్టుకు వెళ్లే విషయంపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించనున్నారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ హైకోర్టుకు వెళ్లి తమ వాదనలను వినిపించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+