మాట వినం!: ఆజాద్ విజ్ఞప్తిని తిరస్కరించిన టి-ఎంపీలు

తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు తాము తమ ఆందోళన ఆపేది లేదని ఎంపీలు చెప్పారు. తాము పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం లేదని పార్టీ అధికారికంగా ప్రకటించిన అంశాన్ని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. తమ ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదన్నారు. తమను హెచ్చరించడం ద్వారా తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లుగా భావిస్తున్నామన్నారు. కేంద్రం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
కాగా మంగళవారం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణ ప్రాంత ఎంపీలు లోకసభలో ప్రత్యేక రాష్ట్రం కోసం గందరగోళం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ సభలో హోరెత్తిస్తున్నారు. వారి చర్యలపై కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ గురువారమే సీరియస్ అయ్యారు. శుక్రవారం ఆజాద్ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఎంపీలు మాత్రం తమ ఆందోళనపై తగ్గేది లేదని వారిద్దరికీ స్పష్టం చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications