దొరికిపోయిన కెవిపి వియ్యంకుడు, ఐటి సోదాల్లో రట్టు?

KVP Ramachandar Rao
హైదరాబాద్: ఐటి సోదాల్లో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు వియ్యంకుడు రఘురాజు అడ్డంగా దొరికిపోయినట్లు ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. బౌల్డర్ ప్రాజెక్టులో రఘురాజు, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఒక విల్లా, నాలుగు ప్లాట్లు ఉన్నట్లు నాటకీయంగా బయటపడిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. కొన్ని రోజుల క్రితం ఐటి శాఖ జరిపిన సోదాల్లో ఈ విషయం బయటపడిందని ఆ పత్రిక రాసింది. ఆ పత్రిక కథనం ప్రకారం - ఏకంగా 30 కోట్ల రూపాయల లావాదేవీలకు లెక్క తేలలేదు. అధికారులు దీనిని బ్లాక్ మనీగా గుర్తించడంతో ఈ వ్యవహారాన్ని మరింత తవ్వి తీయకుండా ఉండేందుకు అప్పటికప్పుడు రూ.30 కోట్లకు పన్ను కట్టేందుకు రఘు రాజు అంగీకరించారు. ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న రికార్డులను, ఇతర వివరాలను పరిశీలించిన అనంతరం ఐటీ అధికారులు మరోసారి రఘురాజు నివాసంపై దాడులు చేశారు. ఈసారి ఏకంగా 80 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వివరాలు బయటపడ్డాయి.

ఆ పత్రిక ఇంకా ఇలా రాసింది - ఆ తర్వాత జరిపిన సోదాల్లో వైఎస్ జగన్ సంస్థల్లో కోల్‌కతాకు చెందిన అల్లిబిల్లి కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్లే రఘు రాజు కంపెనీల్లోకి కూడా డబ్బులు ప్రవహించినట్లు గుర్తించారు. రఘురాజు కుమార్తె ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులకు ప్రయత్నించినప్పటికీ ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఆగిపోయినట్లు సమాచారం. రఘు రాజు వద్ద ఏకంగా రూ.110 కోట్ల బ్లాక్ మనీ వివరాలు బయటపడటం, ఆయనకు ఎమ్మార్‌లో విల్లా, నాలుగు ప్లాట్లు ఉన్నట్లు తెలియడంతో దీనిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. రఘు రాజును పిలిచి ప్రశ్నించారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు తాను చదరపు గజం ఐదు వేలకే కొన్నానని, బ్లాక్‌లో ఏమీ ఇవ్వలేదని చెప్పినట్లు సమాచారం. తన వ్యవహారాలతో కెవిపికి సంబంధం లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలను పరిశీలించిన తర్వాత రఘురాజు అబద్ధం చెబుతున్నాడని సిబిఐ తేల్చుకున్నట్లు తెలస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+