రాత్రంతా శ్రీలక్ష్మి జాగారం, పోలీసులతో బాధలు ఏకరవు!

ఉదయం ఆమె ఓ గంట పాటు ఇష్ట దైవానికి పూజలు చేశారు. కాగా ప్రత్యేక కోర్టు మూడు రోజుల రిమాండుకు అప్పగించడంతో సిబిఐ అధికారులు శ్రీలక్ష్మిని కోఠిలోని తమ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. మరోవైపు తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని ఆమె వేసిన పిటిషన్ను కోర్టు డిసెంబర్ 2వ తేదికి వాయిదా వేసింది. కాగా గాలి, శ్రీనివాస్ రెడ్డిలతో సంబంధాలు, ఆమెపై ఎవరు ఒత్తిడి తీసుకు వచ్చారు, రికవరీ, ముడుపుల తదితర అంశాలపై వివరాలు తీసుకునేందుకు శ్రీలక్ష్మిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు.
అందుకు శ్రీలక్ష్మి తరఫు లాయర్, ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులు శ్రీలక్ష్మి ముడుపులు తీసుకున్నట్లు చెప్పలేదని, లావాదేవీలు ఈమె ద్వారానే జరిగాయన్నది కేవలం సిబిఐ ఊహాజనితమేనని, ఆమెను ఐదుసార్లు విచారణకు పిలిపించి ఖాళీగా కూర్చోబెట్టారన్నారు. అన్ని విషయాలపైన అధికారులకు ఆమె సమాధానమిచ్చారని కాబట్టి సిబిఐ కస్టడీ అవసరం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications