విశ్వాసం నోటీసును ఇచ్చారు, జగన్, కెసిఆర్కు సవాల్

రైతులను ఆదుకోవడంలో కిరణ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోంది ధ్వజమెత్తారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంలో భాగమే అవిశ్వాస తీర్మానం అన్నారు. ఇప్పుడు ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలుతుందన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.
సకల జనుల సమ్మెను కెసిఆర్ సకల సంపదగా మార్చుకున్నారన్నారు. జగన్, కాంగ్రెసు, టిఆర్ఎస్ మూడు తోడు దొంగలే అన్నారు. కాగా అవిశ్వాస తీర్మానం కెసిఆర్, జగన్లకు ఓ సవాల్ అని టిడిపి నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications