జగన్ హంతకుడుకాదన్నాం:విజయమ్మకు బొత్స కౌంటర్

botsa sathyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీపై విమర్సలు గుప్పించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అదే స్థాయిలో కౌంటర్ వేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రాచరిక పాలనలాగా ముఖ్యమంత్రి సీటు కోసం పార్టీని విడిచి వెళ్లారని విమర్శించారు. అవకాశం వచ్చింది కదా అని ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. విజయమ్మ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ హంతకుడు అని టిడిపి నిండు సభలో ఆరోపిస్తే ఆయనకు అండగా నిలిచి వారి వ్యాఖ్యలను ఖండించింది ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు.

కాంగ్రెసు ఎప్పుడూ వైయస్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదన్నారు. వైయస్‌కు అధిష్టానం ఎన్నో పదవులు కట్టబెట్టిందన్నారు. మా దివంగత నేత భార్యగా ఆమె అంటే మాకు గౌరవం ఉందన్నారు. వైయస్ అంటే మాకు ఎంత గౌరవమో ఆమెకు తెలుసునన్నారు. కానీ సానుభూతి పొందడం కోసం అవకాశం వాడుకోవద్దన్నారు. కావాలంటే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. జగన్ కుర్చీ మీద మోజుతోనే పార్టీ వీడి పోయారన్నారు. ఆయన కుర్చీ కోసం పాకులాడారా లేదా అనేది ప్రజలకు తెలుసునన్నారు. వైయస్ తెచ్చిన ప్రభుత్వం అంటూ టిడిపికి అండగా నిలుస్తుంది మీరని నిలదీశారు.

చంద్రబాబు వైయస్‌ను విమర్శించినప్పుడు మేం ఖండించలేదనడం సరికాదన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలే ఏమీ మాట్లాడలేదన్నారు. కాగా బొత్స వ్యాఖ్యలకు విజయమ్మ స్పందించారు. జగన్ ఎప్పుడూ ముఖ్యమంత్రి పీఠం కోసం సోనియాను అడగలేదని ఓదార్పు యాత్ర కోసం మాత్రమే అనుమతి అడిగారన్నారు. సిఎం సీటును జగన్ ఎప్పుడూ కోరలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+