బాబు, జగన్ కుమ్మక్కు, చిరు మిస్టర్ క్లీన్: కన్నబాబు

బయట బాబుపై కేసులు పెట్టి సభలో మద్దతివ్వడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. అది నైతికత ఎలా అవుతుందని ప్రశ్నించారు. బాబు తీర్మానానికి మద్దతివ్వడమంటే ఆయన అవినీతికి మద్దతిస్తున్నారా? లేక రాజకీయ దురుద్దేశ్యంతో మాత్రమే ఆయనపై వైయస్ విజయమ్మ కేసు పెట్టారా? చెప్పాలన్నారు. వైయస్పై టిడిపి విమర్శలు చేస్తుంటే వైయస్ అభిమానులమని చెప్పుకునే ఎమ్మెల్యేలు ఒక్కరు నోరు మెదపలేదని అదే సిఎం, మంత్రులు విరుచుకు పడ్డారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకోవడం అప్రజాస్వామికమనే మా నాయకుడు ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారన్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున అవిశ్వాసం వ్యతిరేకిస్తున్నామని మిగిలిన పార్టీలు కూడా దీనిపై ఆలోచించి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు.
మీరు పడగొడితే మేం నిలబెడతామని ఆయన చెబుతున్నారన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడిపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని అదే సమయంలో ఆయన రైతులను విస్మరించారన్నారు. రైతుపోరు బాట పేరుతో బాబు ప్రజల్లోకి వెళ్లడం ప్రశంసించదగ్గదే అని అయినంత మాత్రాన అవిశ్వాసం పెట్టడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కైనందు వల్లే జగన్ బాబుకు మద్దతిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రంలో క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది చిరంజీవి మాత్రమే అన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు తదితర పార్టీలు బయట కేసులు వేసుకొని సభలో మద్దతిచ్చుకుంటున్నాయని దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఓ వైపు, అధికారం నాదేనని ఒక పార్టీ అధినేత మరోవైపు అంటున్న ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో కిరణ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెనుకడుగు వేయడం లేదన్నారు. అవినీతి టిడిపి నేర్పిన విద్యే అన్నారు. జలయజ్ఞం, గనుల కేటాయింపులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే అన్నారు. తప్పు ఎవరు చేసిన తప్పేనన్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట అధికారంలో లేనప్పుడు మరో రకంగా మాట్లాడవద్దన్నారు. కాగా కన్నబాబు మాట్లాడుతుండగా టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దానికి ఆయన మీరు నన్ను రెచ్చగొట్టవద్దని, మీరు అల్లరి చేస్తే నేను ఇంకా ఎక్కువ మాట్లాడతానని చురకలు వేశారు. మేం అభివృద్ధికి ప్యాకేజీలు కావాలని అడుగుతున్నామని కాని టిడిపి వాళ్లకు మాత్రం వైస్రాయ్ ప్యాకేజీలు కావాలా అని ప్రశ్నించారు. కాగా సభలో ఓ పిట్టకథ చెప్పి అలరించారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications