నగ్నంగా ఉండకండి, నా ఓటు వల్ల ఏమీ కాదు: జెపి

కొన్ని విలువల కోసం సిఎం కిరణ్ తహతహలాడుతున్నారన్నారు. నిజాయితీని కాపాడటం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. అన్ని పార్టీల్లో నిజాయితీపరులు ఉన్నారన్నారు. రాజీవ్ యువ కిరణాలు మంచి పథకమని అందులో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకప్పుడు పార్టీలంటే గౌరవం ఉండేదని ఇప్పుడు నాయకులంటే గౌరవం పోయిందన్నారు. కేబినెట్లో సమన్వయం కొరవడిందన్నారు. సభ విధాన నిర్ణయాలపై చర్చ జరగాలన్నారు. నాయకులు పారదర్శకంగా ఉండాలి కానీ నగ్నంగా ఉండకూడదన్నారు. రాజకీయాలు అంటే అధికారమే అన్న చందంగా కనిపిస్తోందన్నారు. నాయకులు తప్పు చేస్తే శిక్ష విధించాలని వారి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం చేస్తున్నామని మంత్రులు చెప్పగలరా అని ప్రశ్నించారు.
రాజకీయాల్లో ఉన్న వారిని జనం తిట్టిపోస్తున్నారన్నారు. అధికారం పూర్తిగా కొందరి చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుందన్నారు. అన్ని అధికారాలు మన చేతిలో పెట్టుకొని పాలన సాగిస్తామంటే కుదరదన్నారు. విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందన్నారు. మనం సృష్టించిన సంక్షోభానికి మనమే బలవుతున్నామన్నారు. విద్యలో ఎపి అట్టడుగు స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజల బాగు కోసమా? ఓటు బ్యాంకు కోసమా? అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు దొరకడం లేదన్నారు.












Click it and Unblock the Notifications