జగన్వే చిల్లర రాజకీయాలు, ప్రలోభాలపై చెప్తా: బొత్స

తమకు జగన్ సలహాలు అవసరం లేదని ఆయన అన్నారు. ఎవరి మీద ఎప్పుడు వేటు వేయాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. శాసనసభ్యులను తాము ప్రలోభ పెట్టలేదని, వైయస్ జగనే ప్రలోభపెట్టారని ఆయన అన్నారు. ఎవరు ఏ పార్టీ ఉన్నారో అవిశ్వాస తీర్మానం వల్ల తేలిపోయిందని ఆయన అంతకు ముందు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం మంత్రులకు, నాయకులకు, శాసనసభ్యులకు విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి, శాసనసభలో బలం నిరూపించుకున్నందుకు వారంతా ముఖ్యమంత్రిని అభినందించారు.












Click it and Unblock the Notifications