జగన్, కెసిఆర్ ప్యాకేజీ మాట్లాడుకున్నారు: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని, దానివల్లనే వారు తమ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరించారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ప్యాకేజీల రూపంలో ఆ ఇద్దరు నాయకులు లాభపడ్డారని, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు ఏం లాభం జరిగిందో తెలియదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఇచ్చిన సమాధానంలో తెలంగాణ గురించి ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది, చచ్చేది కాంగ్రెసు పార్టీవాళ్లేనని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా ఎన్నికల్లో పోటీ చేయకూడదని, అన్ని పార్టీలు జెండాలనూ ఎజెండాలను పక్కన పెట్టాలని తాము చెప్పినా వినడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు కాంగ్రెసు మోసం చేసింది, అవిశ్వాస తీర్మానం మంచి అవకాశమని తాము చెప్పామని, ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విఫలమైంది ఎవరో తెలిసిపోతూనే ఉన్నదని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులందరితో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయించామని, తమ పార్టీ క్రమశిక్షణ అలాంటిదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని తాము చెబుతూ వస్తున్నామని, అయినా కోదండరామ్ కాంగ్రెసు తెలంగాణ నాయకులను బలపరుస్తూ వస్తున్నారని ఆయన అన్నారు.

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా, దీక్ష నాటకమని తాము ముందే చెప్పామని, డిసెంబర్ 1వ తేదీలోగా పార్టీ అధిష్టానం తెలంగాణ ఇస్తూ ప్రకటన చేయకపోతే పార్టీలో ఉండబోనని చెప్పారని, ఇప్పుడు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని, దీనికి కోదండరామ్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+