పోలవరం రగడ: టిడిపి, టిఆర్ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్లు

Telugudesam
హైదరాబాద్: సోమవారం అసెంబ్లీలో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు పోలవరంపై సవాళ్లు ప్రతిసవాళ్లకు దిగాయి. టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయని టిఆర్ఎస్ వారికి అక్రమాలలో భాగస్వామ్యం ఉందంటూ రాజాం పేరును ప్రస్తావించారు. అయితే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో లేని వారి పేరును ప్రస్తావించవద్దని సూచించడంతో బాబు అక్రమాలు జరిగాయని టిఆర్ఎస్ హస్తం ఉందని చెప్పారు. దీంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోపణలు చేసినప్పుడు నిరూపించాలన్నారు.

పోలవరం టెండర్లలో అక్రమాలకు తమకు సంబంధం లేదని తమకు సంబంధం ఉందని నిరూపిస్తే తాము అసెంబ్లీలో ముక్కు నేలకు రాస్తామని సవాల్ విసిరారు. పోలవరంపై ఇప్పటి వరకు వైఖరి చెప్పలేదంటూ విరుచుకు పడ్డారు. ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ ధ్వజమెత్తారు. అయితే పోలవరం టెండర్లలో జరిగిన అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ సకల జనుల సమ్మెను టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోలవరం టెండర్ల కోసం నిర్వీర్యం చేశారని వారు ఆరోపించారు. టెండర్లలో అక్రమాలు నిరూపించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని టిఆర్ఎస్సే అందుకు చర్చకు రావడం లేదని విమర్శించారు.

అయితే ఈ సవాళ్లు ప్రతిసవాళ్లు వారు చేసుకుంటున్నప్పటికీ ఆ తర్వాత చర్చకు ఎవరూ రాకపోవడం విశేషం. పోలవరం టెండర్లలో అక్రమాలు అంటూ సమ్మె నిర్వీర్యం అయిన సమయంలోనే టిడిపి ఆరోపించింది. కొన్ని ఆధారాలు మీడియాకు విడుదల చేసింది. అప్పుడు టిఆర్ఎస్ కూడా రాజాంకు ఉన్న సంబంధంపై వివరణ ఇచ్చుకుంది. కానీ బహిరంగ చర్చ అంటూ అప్పుడు సవాళ్లు విసురుకొని ఊరుకున్నట్లుగానే ఇప్పుడూ అదే జరుగుతుందనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+