హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడుపు కొట్టి భవంతి కట్టాడు: జగన్‌పై ఎర్రన్నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కడుపు కొట్టి లోటస్ పాండులోని భవంతి, బెంగళూరులోని భవంతులు కట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు బుధవారం ధ్వజమెత్తారు. కాంగ్రెసు గుర్తుతో గెలిచిన ప్రజాప్రతినిధులను తన ఎమ్మెల్యేలుగా జగన్ ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం నడుపుతున్న మైనార్టీ ప్రభుత్వమేనన్నారు. బయట నుండి ఎంఐఎం, ప్రజారాజ్యం మద్దతిస్తున్నారని కానీ వారు కాంగ్రెసులో భాగం కానే కాదన్నారు.

రైతుల సమస్యలపై తాము అవిశ్వాసం పెడితే ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదనడం రైతులను అపహాస్యం చేయడమేనని అవి ద్రోహపూరిత వ్యాఖ్యలన్నారు. రోజుకు డజను మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రాష్ట్రవ్యాప్తంగా పంట విరామం ప్రకటిస్తుంటే అది అసాధారణ విషయం కాదా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో మందులు లేవవి, వైద్యులు లేరని ఆరోపించారు. ఆత్మహత్యలు రైతులు మంత్రులకు పట్టడం లేదన్నారు.

English summary
TDP senior leader Yerram Naidu accused YS Jaganmohan Reddy for his buildings and also lashes out at Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X