వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈనాడులో రామోజీ రావు అబద్దాలు చెప్పారన్న సాక్షి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sakshi
హైదరాబాద్: పాలమాకుల భూముల విషయంలో రామోజీ రావు తన ఈనాడు పత్రికలో అబద్దపు వార్తలు రాశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక ప్రచురించింది. ''ఒక ఆస్థిని కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన పూర్తి చరిత్రను అధ్యయనం చేసి, లోటుపాట్లు లేవని సాధికారికంగా ధ్రువీకరించుకోవడం మా విధానం. పాలమాకుల గ్రామం వద్ద మా వాళ్లు కొన్న భూముల్లో ఏ లొగుసులూ లేవు. వాటిలో అసైన్డ్, ప్రభుత్వ భూములు'' లేవని ఈనాడు ఆగస్టు 3వ తేదిన మొదటి పేజీలో వచ్చిన కథనం రామోజీ తనకు అనుకూలంగా అందమైన పదాలతో అల్లిన పచ్చి అబద్ధమని సాక్షి పేర్కొంది. ఆగస్టు ఒకటిన సాక్షి కథనానికి వివరణగా అది వచ్చిందని అందులో అబద్దాలు ఉన్నాయని పేర్కొంది.

పాలమాకులలో రామోజీ బినామీ పేర్లతో భూములు కూడబెట్టుకున్నారని, ప్రభుత్వం, పేదల భూములు కలుపుకున్నారని ఆరోపించింది. అక్రమాలు అధికారుల పరిశీలనలో బట్టబయలు అవుతాయేమోనని గుట్టు చప్పుడు కాకుండా ఫెన్సింగ్ తొలగించారని ఆరోపించింది. 431 ఏకరాలను సర్వే చేస్తే భారీ ఎత్తున అసైన్డ్ స్థలాల గుట్టు తేలటం ఖాయమని స్థానికులు చెబుతున్నారని పేర్కొంది. హైటెక్ సిటీ భూబాగోతం తర్వాత వట్టినాగులపల్లిపై బాబు బినామీల కన్ను పడిందంటూ బాబు పొట్టలో వట్టినాగులు పేరుతో మరో కథనం రాసింది. గ్రామ రైతుల నుండి కారుచౌకగా భూములు కొనుగోలు చేసి ఆ తర్వాత ఆయన సన్నిహితులు భారీగా లాభపడ్డారని చెప్పింది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy Sakshi accused Ramoji Rao for Eenadu stories about Palamakula lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X