రాజకీయ దురుద్దేశ్యం:'విజయమ్మ'పై రామోజీ లాయర్

ramoji rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాజకీయ దురుద్దేశ్యంతోనే హైకోర్టులో పిటిషన్ వేసిందని రామోజీ రావు తరఫు న్యాయవాది హైకోర్టులో మంగళవారం వాదించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసు వెకేట్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. విజయమ్మ తరఫు న్యాయవాది సోమవారం తన వాదనలు వినిపించారు. అనంతరం రామోజీ న్యాయవాది సమయాభావం వల్ల పూర్తిగా వినిపించలేదు. మంగళవారం ఆయన తన వాదనలు వినిపించారు. విజయమ్మ కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే పిల్ వేశారన్నారు.

ఆమె పిటిషన్ పైన హైకోర్టు తమ వాదనలు వినకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. సుమారు గంటన్నర పాటు ఆయన తన వాదనలు వినిపించారు. అనంతరం బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+