లిక్కర్ స్కామ్లో మంత్రుల హస్తం: మోత్కుపల్లి

మద్యం కుంభకోణంలో రెండు కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆయన అన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వం ఎవరి ప్రాణాలు తీస్తుందో ఆలోచించాలని ఆయన అన్నారు. మద్యం కుంభకోణంలో మంత్రుల పాత్రకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం నాయకుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. పోలవరం టెండర్ల విషయంలో తాము చేసిన ఆరోపణలు నిజమని తేలిందని తెలుగుదేశం మరో నేత మండవ వెంకటేశ్వర రావు అన్నారు. పోలవరం టెండర్లపై తాము సాగిస్తున్న పోరాటం ఆగదని ఆయన అన్నారు. అక్రమాలు చోటు చేసుకున్న ఫైళ్లను అన్నింటినీ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications