ఉప ఎన్నికలకు మేం రెడీగా ఉన్నాం: అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేస్తే తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం నిర్ణయాలను ఆయన శనివారం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. తమ శాసనసభ్యులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేటు వేస్తారో లేదో తెలియదని, అయితే తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఫీజుల బకాయిలను చెల్లించాలని డిమాండుతో వచ్చే నెల 4వ తేదీన ఒంగోలు జరిగే ధర్నాలో వైయస్ జగన్ పాల్గొంటారని ఆయన చెప్పారు. విద్యార్థులకు ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిాండ్ చేశారు

ఈ నెల 23వ తేదీన రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సదస్సులు జరుగుతాయని, జగన్ ఎక్కడ ధర్నాలో పాల్గొంటారనేది తెలియదని ఆయన అన్నారు. 108, 104 సర్వీసుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో వైయస్ జగన్‌కు ఉన్న ఆదరణను చూసే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+