తెలంగాణ కుంపటి పెట్టింది వైయస్సే: లోక్సత్తా నేత జెపి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ ప్రజల సమస్యలు కూడా పరిష్కారం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. హింస ద్వారా ముందుకు పోతే నష్టపోయేది తెలంగాణ ప్రజలేనని ఆయన అన్నారు. 14ఎఫ్ తొలగింపునకు, 610 జీవో అమలుకు పోరాటం చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని ఆయన చెప్పుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన అఖిల పక్ష కమిటీలో తమకు ఏ విధమైన స్థానం లేదని, అయినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. పోలవరం టెండర్లను త్వరితగతిన పూర్తి చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications