వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యలకు ప్రోత్సహించవద్దు: వైయస్ విజయమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
కడప: తన నియోజకవర్గం రైతులను ఆత్మహత్యలకు ప్రోత్సహించవవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప జిల్లా పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. చిత్రావతి రిజర్వాయర్‌ను ఆమె సోమవారం రైతులతో కలిసి సందర్శించారు. నీటి లభ్యతకు సంబంధించిన వివరాలను ఆమె ప్రాజెక్టు ఎస్ఇని, డిఇని అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలను ఆమె అధికారులకు వివరించారు. చిత్రావతి రిజర్వాయర్‌కు తుంగభద్ర హైలెవెల్ కెనాల్ నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన సాగు, మంచినీళ్లను విడుదల చేయాలని ఆమె కోరారు. డ్యామ్‌లో తగినంత నీరు లేనందున ఇబ్బంది అవుతోందని ఆమె చెప్పారు.

పులివెందుల ప్రాంత ప్రజలకు మంచినీటి కోసం సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని, పంటలన్నీ ఎండిపోయేలా ఉన్నాయని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే సాగు నీటి సమస్య వచ్చి ఉండేది కాదని ఆమె అన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు. ఎన్ని లేఖలు రాసినా స్పందించడం లేదని ఆమె విమర్శించారు. జనవరి 1వ తేదీలోగా చిత్రావతికి 0.5 టిఎంసిల నీరు ఇవ్వడానికి అధికారులు ఆమె హామీ ఇచ్చారు. అయితే లిఖితవూర్వక ఆమె కోసం ఆమె అనంతపురానికి బయలుదేరి వెళ్లారు.

English summary
YSR Congress party Pulivendula MLA YS Vijayamma urged irrigation officers not to encourage farmers towards suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X