హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ పిటిషన్‌పై కౌంటర్‌కు శ్రీలక్ష్మికి 26 వరకు గడువు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilaxmi
హైదరాబాద్: గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. సిబిఐ పిటిషన్‌పై ఈ నెల 26వ తేదిలోగా కౌంటర్ దాఖలు చేయాలని శ్రీలక్ష్మిని హైకోర్టు ఆదేశించింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మిని సిబిఐ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె బెయిల్ పొంది ఇప్పుడు బయట ఉంది. అమెకు బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది.

కాగా గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లపై శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. తనకు బెయిల్ కావాలని గాలి నాలుగోసారి పిటిషన్ దాఖలు చేశారు. గురువారం గాలి, సిబిఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.

English summary
High Court ordered Srilaxmi for counter petition on CBI PIL. arguments adjourned to 28th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X