లిక్కర్ డాన్ను కాదు: సిఎంను వెనుకేసుకొచ్చిన బొత్స

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి నిర్మూలనకే కృషి చేస్తున్నారన్నారు. మద్యంపై విధానాన్ని మార్చింది బాబే అన్నారు. సిఎం ప్రోద్బలంతోనే మద్యం సిండికేట్లపై దాడులు జరిగాయనడం అర్థరహితమన్నారు. సిఎంకు చెక్ చెప్పేందుకే సమన్వయ కమిటీ అన్న వార్తల్లో కూడా వాస్తవం లేదన్నారు. కమిటీ విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, విధివిధానాలు కాంగ్రెసుకు కొత్త కాదన్నారు. అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. కమిటీ ఏర్పాటుతో తెలంగాణ వారికి అన్యాయం అనడం సరికాదన్నారు. ఎవరి ప్రాంతాల మనోభావాలు వారికి ఉంటాయని అది తప్పు కాదన్నారు. పార్టీ బలోపేతానికే సమన్వయ కమిటీ అన్నారు.
త్వరలో ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. 26న మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశం ఉంటుందన్నారు. ఉప ఎన్నికలపై జగన్ వర్గం ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలే అన్నారు. ఎమ్మెల్యేలపై వేటు స్పీకర్ పరిధిలో ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications