వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి హక్కు లేదు: స్పీకర్‌కు శోభా నాగి రెడ్డి లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shoba Nagi Reddy
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి తనను ప్రశ్నించే హక్కు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి సోమవారం అన్నారు. ఆమె స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి రాజీనామాను సమర్పించారు. ఆమె స్పీకర్‌కు ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. తనపై ఫిర్యాదు చేసే హక్కు చిరంజీవికి లేదని అందులో పేర్కొన్నారు. తన రాజీనామాను ఇప్పటికైనా ఆమోదించాలని కోరారు.

అనర్హత పిటిషన్‌పై కోర్టుకు వెళ్లే హక్కు తనకు ఉందన్నారు. సమయం వస్తే తనపై నిర్ణయాన్ని ప్రజల్లోనే తేల్చుకుంటానని చెప్పారు. తాను ఆత్మసాక్షిగానే అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసినట్లు చెప్పారు. ఉప ఎన్నికలకు తాను భయపడటం లేదని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలకు వివరించేందుకే తాను బహిరంగ లేఖ రాశానని చెప్పారు.

English summary
Chiranjeevi has no right to question me, said Sobha Nagi Reddy today after met speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X