కాంగ్రెసును చంకనేసుకుంటున్నారు: కోదండరామ్‌పై గౌడ్

Devender Goud
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణలో అడ్డుకుంటామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన ప్రకటనపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు టి. దేవేందర్ గౌడ్ మండిపడ్డారు. చంద్రబాబును అడ్డుకోవాలని పిలుపునిచ్చి కోదండరామ్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తెలంగాణను మోసం చేసిన కాంగ్రెసు పార్టీని కోదండరామ్ చంకనేసుకుని తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోదండరామ్ ప్రకటన బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. కోదండరామ్ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కరెంట్ చార్జీలు పెంచితే సహించేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది ప్రజా ప్రభుత్వం కాదని, అది పన్నుల ప్రభుత్వమని ఆయన అన్నారు. ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు ప్రార్టీ ఇప్పుడు ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం చేతకాని తనం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. సామాన్య మానవుడిపై ప్రభుత్వం పిడుగులు కురిపిస్తోందని, కరెంట్ చార్జీలు పెంపు ప్రతిపాదన అటువంటిదేనని ఆయన అన్నారు. కరెంట్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+