విదేశీ దుస్తులు ధరించే జగన్కు ఏం తెలుసు?: కొండ్రు

కొండ్రు మురళి, గండ్ర వెంకట రమణా రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి మీడియా సమావేశంలో జగన్ తీరుపై వేరుగా మండిపడ్డారు. ఇంపోర్టెండ్ దుస్తులు వేసుకునే జగన్ పత్తి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరమని కొండ్రు ఎద్దేవా చేశారు. రైతుల గురించి జగన్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మాట్లాడే హక్కు లేదన్నారు. రైతులు, ఓదార్పు పేరుతో జగన్ చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు నమ్మరన్నారు. టమాటా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం కొత్తకాదని బాబు, దివంగత వైయస్ హయాంలోనూ ఈ సమస్య ఉందన్నారు.
జగన్ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్ను కలవడం ఓ నాటకమని కొట్టి పారేశారు. రాజకీయ లబ్ది కోసమే వారు కలిసే నాటకం ఆడుతున్నారన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించే ప్రసక్తి లేదన్నారు. జగన్, చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. కిరణ్ సర్కారు రైతుల పక్షపాతి అన్నారు. కాంగ్రెసు ఎప్పుడూ రైతుల శ్రేయస్సు కోరుతుందన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications