వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐకి అందుబాటులో ఉన్నా: ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilakshmi
హైదరాబాద్: సిబిఐ ముందుకు తాను పలు మార్లు వచ్చానని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి చెప్పారు. తన బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆమె సోమవారం హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు తెలిసిన విషయాలన్నీ సిబిఐకి చెప్పినట్లు ఆమె తెలిపారు. తాను సిబిఐకి అందుబాటులోనే ఉన్నానని, తన పాసుపోర్టును కూడా అప్పగించానని ఆమె చెప్పారు.

గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుతో తనకు సంబంధం లేదని, అక్రమాలతో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను గనుల శాఖ కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టక ముందే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి)కి గనుల లీజులు మంజూరయ్యాయని ఆమె చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మికి సిబిఐ ప్ర్తత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒఎంసి కేసులో శ్రీలక్ష్మి నాలుగవ నిందితురాలు. అయితే, ఆమె పేరును సిబిఐ అధికారులు చార్జిషీట్‌లో చేర్చలేదు. ఆమెపై మరింత దర్యాప్తు జరుగుతోందని, అందువల్లనే ఆమె పేరు చేర్చలేదని ఇంతకు ముందు వివరణ ఇచ్చింది.

English summary
Accused in Gali Kanardhan Reddy's illegal mining case Srilakshmi has filed counter in CBI petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X