టిడిపి తెలంగాణ నేతల తిట్ల దండకం: కెసిఆర్ టార్గెట్
తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంత తీవ్ర స్థాయిలో కాకున్నా కెసిఆర్పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధానంగా తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ను టార్గెట్ చేసుకుంటున్నారు. కావాలనే కోదండరామ్ తమ పార్టీని టార్గెట్ చేసుకున్నారని ఆయన సోమవారం వరంగల్లులో విమర్శించారు. తెలంగాణ జెఎసి నుంచి అందరూ బయటకు వస్తారని, తెరాస ఒక్కటే మిగులుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని అప్పుడే చెప్పారని ఆయన అన్నారు.
మరో తెలుగుదేశం తెలంగాణ నాయకుడు కడియం శ్రీహరి కూడా తెరాసపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడిని అడ్డుకోవద్దని ఆయన తెలంగాణ జెఎసికి సూచించారు. చంద్రబాబును అడ్డుకుంటే తాము తగిన బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. తెలగాణకు అనుకూలగా చంద్రబాబు 2008లోనే లేఖ ఇచ్చారని ఆయన అన్నారు. తెరాస, తెలుగుదేశం పార్టీల మధ్య వేడి రాజుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.