కెసిఆర్ రాక్షసుడు: టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహలు

Mothkupalli Narsimhulu and Devineni Umamaheshwara Rao
నల్లగొడ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌ను ఆయన రాక్షసుడిగా, కుంభకర్ణుడిగా అభివర్ణించారు. తెలంగాణవాదులంతా ఏకమై కెసిఆర్ నియంతృత్వ వైఖరిని ఖండించాలని ఆయన సోమవారం పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మెను విరమించి కెసిఆర్ సర్వసంపదలు కూడగట్టుకున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంటుకు వెళ్లకుండా కెసిఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కెసిఆర్ అమ్ముడుపోయినందుకు నిరసనగా తాము ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాదులోని గన్‌పార్కు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలకు కెసిఆర్‌దే బాధ్యత అని ఆయన అన్నారు. మూడు ప్రాంతాల్లో పార్లమెంటుకు ఎన్నుకుంటే కెసిఆర్ తెలంగాణ అంశాన్ని సభలో ప్రస్తావించలేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఉరి వేసుకుందాం రమ్మంటే కెసిఆర్ దాక్కున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ తీరు పల్ల బలహీన వర్గాల విద్యార్థులు, యువకులే నష్టపోయారని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం ఉరి వేసకుందామంటూ మోత్కుపల్లి నరసింహులు ఇటీవల ఉరితాడుతో గన్ పార్కు వద్దకు చేరుకున్న విషయం తెలిసిందే. కెసిఆర్‌ను టార్గెట్ చేసుకుంటూ ఆయన ఇటీవలి కాలంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+