కెసిఆర్ ఉద్యమ ప్రకటనతో విద్యార్థుల గుండెల్లో రైళ్లు
సకల జనుల సమ్మె తర్వాతనే కాస్తా నింపాదిగా తెలంగాణలో విద్యాసంస్థలు నడుస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నవంబర్ నుంచే విద్యాసంస్థలు సజావుగా నడుస్తున్నాయి. సిలబస్ పూర్తి కావడానికి కూడా చాలా సమయం పట్టే స్థితి ఉంది. విద్యాసంవత్సరం దెబ్బ తింటే విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది. నిజానికి, జనవరి నుంచే విద్యా సంస్థలు చురుగ్గా పనిచేస్తూ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తాయి. ఈ కాలంలోనే మళ్లీ తెలంగాణ ఉద్యమం చెలరేగితే విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పడంలో సందేహం లేదు.
Comments
English summary
The TRS chief, Mr K. Chandrasekhar Rao’s announcement on Monday that the Telangana agitation would be intensified after Sankranti festival, has got students preparing for various exams across the state worried.
Story first published: Tuesday, December 27, 2011, 11:13 [IST]