వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుబ్బరాయసాగర్ నీటి వివాదం: జెసి వర్సెస్ శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy and Sailajanath
అనంతపురం: జిల్లా సుబ్బరాయసాగర్ నీటి వివాదం మంగళవారం కాస్త ఉద్రిక్త పరిస్తితికి దారి తీసింది. సుబ్బరాయసాగర్ నీటి విడుదల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, జిల్లా సీనియర్ కాంగ్రెసు నేత జెసి దివాకర్ రెడ్డి మంగళవారం స్వయంగా తన కార్యకర్తలతో వెళ్లి తాడిపత్రి రెండో ఆయకట్టుపై ఉన్న ఇసుక బస్తాలను తొలగింప జేశారు. ఇటీవల మంత్రి శైలజానాథ్ వర్గీయులు తాడిపత్రి రెండో ఆయకట్టు వద్ద పుత్తూరు వైపు సుబ్బరాయసాగర్ నుండి నీరు వెళ్లేందుకు ఇసుక బస్తాలు వేయించారని సమాచారం.

దీంతో తమకు నీరు రాకుండా మంత్రి శైలజానాథ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన జెసి వర్గీయులు మంగళవారం ఆ ఇసుక బస్తాలను తొలగించారు. తమకు నీటిని కేటాయించిన తర్వాతే పుత్తూరుకు నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. వారు వేసిన ఇసుక బస్తాలను జెసి తీసివేయించడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

English summary
Former Minister JC Diwakar Reddy followers removed sand bags from Tadipatri second water bridge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X