హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసులో మంత్రులు, అధికారులు: పిల్ కొట్టి వేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఆయన కంపెనీల్లోకి పెట్టుబడులకు సంబంధించిన కేసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జివోలు జారీ చేసిన అప్పటి మంత్రులు, అధికారులను బాధ్యులను చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ ఇటీవల దాఖలు చేశారు. ఇందులో ఆయన లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని, అందువల్ల దానిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.

మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సిబిఐ అధికారులకు చెప్పుకోవాలని కోర్టు పిటిషనర్‌కు సూచించింది. కాగా సిబిఐ ప్రత్యేక కోర్టులో తన పిటిషన్ కొట్టి వేయడంతో ఈ అంశంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని పిటిషనర్ సుధాకర్ రెడ్డి చెప్పారు. కాగా జగన్ ఆస్తులకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

English summary
CBI special court abrogated Sudhakar Reddy's petition in YS Jaganmohan Reddy property case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X