భూవివాదమే పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ప్రాణం తీసింది
వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆ భూమిని తనకు ఇచ్చేయాలని, తన పేరు మీద రిజిష్టర్ చేయించాలని గొడవకు దిగినట్లు ఓ ప్రముఖ టీవీ చానెల్ వార్తాకథనాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, అందుకు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి నిరాకరించడాని చెబుతున్నారు. ఈ వివాదమే గత కొద్ది రోజులుగా నడుస్తోంది. దీనిపైనే పటోళ్ల గోవర్ధన్ రెడ్డి మంగళవారం ఓ శాసనసభ్యుడిని కలవడానికి వెళ్లాడని చెబుతారు. అయితే ఎమ్మెల్యే కలవలేదని తెలుస్తోంది. దాంతో తిరిగి వస్తుండగా తనతో పాటు ఆటోలో ఉన్న అనుచరుడు అనిల్ మరికొంత మంది సాయంతో హత్య చేసినట్లు చెబుతున్నారు.
తనకు తన అనుచరుల నుంచి ప్రాణభయం ఉందని భావించిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనిల్ అనే అనుచరుడిని వెంటేసుకుని వాహనాలను వదిలేసి గత కొద్ది రోజులుగా తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అనిల్తో కలిసి ప్రత్యర్థులు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యకు కుట్ర చేశారని ఓ ప్రముఖ టీవీ చానెల్ కథనం.