అంబటి నోట తెలంగాణ ఆత్మగౌరవం మాట

Amabti Rambabu
గుంటూరు/ హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నోట తెలంగాణ ఆత్మగౌరవం మాట వెలువడింది. తెలంగాణ శానససభ్యులు ఆ ప్రాంత ఆత్మగౌరవం కోసం రాజీనామాలు చేశారని, అందుకే తమ పార్టీ అభ్యర్థులను వారిపై పోటీకి దింపకూడదని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 2009 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో జత కట్టి, ఇప్పుడు దమ్మెత్తిపోస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తమపై మాట్లాడే హక్కు లేనది ఆయన అన్నారు.

ఉప ఎన్నికలు రెఫరెండం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు రెఫరెండం కాదన్న ముఖ్యమంత్రి నైతికంగా ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. మద్యపానానికి వ్యతిరేకంగా మహిళల్లో సామాజిక విప్లవం రావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ హైదరాబాదులో అన్నారు. మద్యమే ప్రధాన ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. చీప్ లిక్కర్ ధరల మీద నియంత్రణ లేకపోవడం వల్ల పలు అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కల్తీ సారాకు బలైనవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి అలవాటై పోయిందని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+