హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీలక్ష్మికి షాక్: బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilaxmi
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నాలుగవ నిందితురాలైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి రాష్ట్ర హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీలోగా సిబిఐ కోర్టు ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆమెను ఆదేశించింది. డిసెంబర్ 2వ తేదీన ఆమెకు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు సాయంత్రం ఆమె చర్లపల్లి మహిళా కోర్టు నుంచి విడుదలయ్యారు. సిబిఐ కోర్టు మంజూరు చేస్తూ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై వాదోపవాదాలు ముగిసిన తర్వాత హైకోర్టు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించింది.

గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని సిబిఐ నవంబర్ 28వ తేదీన అరెస్టు చేసింది. ఆ తర్వాత రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్న సిబిఐ ఆమెను ప్రశ్నించింది. ఆమెను సిబిఐ డిసెంబర్ 1వ తేదీన కోర్టులో హాజరు పరిచింది. శ్రీలక్ష్మి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఆమె బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటషన్‌లో వాదించింది. సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శ్రీలక్ష్మి రెండు సార్లు సిబిఐ ముందు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఓసారి సిబిఐ కోర్టులో కూడా హాజరయ్యారు. అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించారని సిబిఐ ఆరోపించింది.

English summary
The High Court has cancelled IAS officer Srilakshmi's bail granted by CBI court in Gali janardhan Reddy illegal mining case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X