వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం ఎసి గదిలో కులుకుతున్నాడు: చంద్రబాబు
సోనియా కాళ్ల వద్ద కాంగ్రెసు నాయకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కల్తీ సారా తాగి మరణించినవారంతా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారేనని ఆయన అన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు అమ్మి ఉంటే వారు కల్తీ సారా బారిన పడి ఉండేవారు కాదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి పేదవారంటే లెక్కలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు పేదలను రాబందుల్లా పీడిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పేదవారికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఊరూరా బెల్టు షాపులను మాత్రం అనుమతిస్తోందని ఆయన అన్నారు. కల్తీ సారా తాగి 18 మంది మరణిస్తే పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి రాలేదని ఆనయ దుయ్యబట్టారు.
Comments
chandrababu naidu telugudesam krishna district vijayanagaram చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కృష్ణా జిల్లా విజయనగరం
English summary
TDP president N Chandrababu Naidu has lashed out at CM Kiran Kumar Reddy on hooch tragedy.
Story first published: Monday, January 2, 2012, 16:21 [IST]