వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ తర్వాతే తెలంగాణపై చంద్రబాబు లేఖ: ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
వరంగల్: కాంగ్రెసు స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని కాంగ్రెసు తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దయాకర్ రావు సోమవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెసు నాయకులు వారి పార్టీపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేతులు కలిపారని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెరాస కుమ్మక్కయి తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దొంగ దీక్ష తర్వాతనే తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయని ఆయన విమర్శించారు.

English summary
TDP Telangana forum convener Errabelli Dayakar Rao said that his party president N Chandrababu Naidu will submit letter after Congress statement on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X