హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలిపిరి కాలినడక బాటలో గుండెపోటుతో భక్తుడి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: అలిపిరి కాలి నడక బాటలో సోమవారం ఉదయం ఓ భక్తుడు గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాదులోని పద్మావతి నగర్‌కు చెందిన వంశీ కృష్ణ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఆయన కాలి నడక దారిలో సుమారు పద్దెనిమిది వందల మెట్లు ఎక్కిన తర్వాత గాలి గోపురం వద్ద గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన తోటి భక్తులు, టిటిడి అధికారులు వంశీ కృష్ణను గాలి గోపురం వద్ద ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. కాగా వంశీ కృష్ణ మృతి పట్ల టిటిడి విచారం వ్యక్తం చేసింది.

కాగా కాలి నడక బాటలో భక్తులు అనారోగ్యానికి గురవుతుండటంతో టిటిడి ఇప్పటికే గాలి గోపురం వద్ద ప్రాథమిక వైద్య శాలను ఏర్పాటు చేసింది. 500 మెట్ల పరిధిలో ఓ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో టిటిడి ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
A Hyderabad devotee Vamsi Krishna dead with heart attack at galigopuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X