చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళ మహిళలకు కిస్, అమెరికన్లకు పిడిగుద్దులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tamilnadu
చెన్నై: నూతన సంవత్సరం ఉత్సాహంలో తమిళనాడు మహిళలకు ముద్దులు పెట్టిన అమెరికా సీమెన్ పిడిగుద్దులు తినాల్సి వచ్చింది. స్థానిక మహిళలకు ముద్దులతో శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రయత్నించిన ఇద్దరు అమెరికన్లు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు. మహిళలకు ముద్దులు పెట్టిన ఆ ఇద్దరిని అక్కడివారు తీవ్రంగా కొట్టారు. అమెరికా పౌరులు రసెల్‌కే ఫ్రాన్సిస్ (48), జాన్ డగ్లాస్ (47) కార్గో షిప్‌లో భద్రతాధికారులుగా పనిచేస్తున్నారు. వారి ఓడ టిటికోరిన్ ఓడరేవులో ఆగింది. ఓ హోటల్‌లో డ్రింక్స్ తీసుకుని పాలాయంకొట్టాయ్ - టుటికోరిన్ రోడ్డు మీద పడ్డారు. వారితో పాటు వారి మిత్రుడు కూడా ఉన్నాడు.

రోడ్డుపై నూతన సంవత్సర సంబరాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా వారిద్దరు మహిళలతో చేతులు కలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలపడంలో మునిగిపోయారు. ఓ సందర్భంలో వారిద్దరు స్థానిక మహిళలకు ముద్దులు పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక సందర్భంలో వారు బీరు సీసాలతో, చెప్పులతో ఓ దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారి ప్రవర్తనకు విసిగిపోయిన స్థానికులు వారిద్దరిని పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని విడిపించారు. వారి మిత్రుడు మాత్రం పారిపోయాడు. సోదరులైన ఆ ఇద్దరు అమెరికన్లు కాలిఫోర్నియాకు చెందినవారని తెలుస్తోంది. రసెల్‌కె,త జాన్‌లను ఆస్పత్రిలో చేర్చారు.

English summary
US citizens Russel cay Francis (48) and John Douglas (47), and another comrade, working as security personnel in a cargo ship, were in Tuticorin as their ship was anchored in the port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X