టిడిపి ఓట్లు పెరగలేదు, అన్ని సీట్లూ మావే: కెసిఆర్

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కొండా సురేఖపై పరకాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. వరంగల్లు జిల్లా జనగామలో తమ నేత సునీతపై దురుసుగా వ్యవహరించిన సిఐని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రైతు సమస్యలపై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. జనగామలో అరెస్టు చేసిన తమ నేతలను విడుదలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే ప్రజలు నిలదీస్తారని ఆయన చెప్పారు.
తెలంగాణలో పర్యటించే ఆంధ్రాబాబులందరినీ నిలదీస్తామని ఆయన చెప్పారు. మహబూబ్నగర్ శానససభా నియోజకవర్గంలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. నాగర్ కర్నూలులో మాత్రం నాగం జనార్దన్ రెడ్డికి మద్దతిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications