వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఓట్లు పెరగలేదు, అన్ని సీట్లూ మావే: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో స్థానాలన్నీ తమవేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. పార్టీ పల్లెబాట ఇంచార్జీల సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఒక్క శాతం ఓట్లు కూడా పెరగబోవని ఆయన అన్నారు. సర్వే ఫలితాలను ఆయన వెల్లడించారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఈ నెల 7,8.9 తేదీల్లో పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, 18వ తేదీన తెలంగాణ జెఎసి సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కొండా సురేఖపై పరకాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. వరంగల్లు జిల్లా జనగామలో తమ నేత సునీతపై దురుసుగా వ్యవహరించిన సిఐని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రైతు సమస్యలపై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. జనగామలో అరెస్టు చేసిన తమ నేతలను విడుదలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే ప్రజలు నిలదీస్తారని ఆయన చెప్పారు.

తెలంగాణలో పర్యటించే ఆంధ్రాబాబులందరినీ నిలదీస్తామని ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్ శానససభా నియోజకవర్గంలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. నాగర్ కర్నూలులో మాత్రం నాగం జనార్దన్ రెడ్డికి మద్దతిస్తామని ఆయన చెప్పారు.

English summary
TRS president K Chandrasekhar Rao said that TDP has not gained strength in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X