బాబు కేసు బదలీపై విజయమ్మ పిటిషన్: నేడు విచారణ

YS Vijayamma-Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణను ఇతర కోర్టుకు బదలీ చేయాలన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్ గురువారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రాష్ట్ర హైకోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, కాబట్టి చంద్రబాబు ఆస్తులపై విచారణను ఇతర రాష్ట్ర హైకోర్టులకు లేదా సుప్రీం కోర్టుకు బదలీ చేసి విచారణ జరపించాలని విజయమ్మ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇది సుప్రీంలో విచారణకు రానుంది.

కాగా రెండు నెలల క్రితం వైయస్ విజయమ్మ చంద్రబాబు ఆస్తులపై 2424 పేజీల పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన హైకోర్టు సిబిఐ, డిజిపి తదితర నాలుగు విచారణకు ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు సూచనల మేరకు తన ఆస్తులపై విచారణ ఆపాలని చంద్రబాబు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమ వాదనలు వినకుండానే విచారణకు ఎలా ఆదేశిస్తారని బాబు తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు చంద్రబాబు ఆస్తుల విచారణపై స్టే విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+