బాబును సిఎం చేయడానికే టిటిడిపి డ్రామాలు: ఈటెల

Etela Rajender
హైదరాబాద్: చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడానికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ శుక్రవారం తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. టిటిడిపి నేతల తీరు చూసి ప్రజలు తలదించుకుంటున్నారన్నారు. పార్టీలో ఆంధ్రా నేతలు పెత్తనం చేస్తుంటే సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ఇలాగే ఉంటే ప్రజలు వారిని తరిమి కొడతారన్నారు. వారికి రాజకీయంగా ఘోరీ కట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. తెలంగాణ ఆడబిడ్డలతో టిడిపి కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రా రజాకార్లకు వారు అండగా నిలుస్తూ తెలంగాణ ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు.

చంద్రబాబు ఆంధ్రా గూండాలతో ఇక్కడ దాడి చేస్తున్నారన్నారు. బాబు ఎవర్ని ఉద్దరించడానికి ఈ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన యాత్ర కారణంగా పదిహేను మంది గాయపడ్డారన్నారు. టిటిడిపి నైజం బయటపడిందన్నారు. ప్రజలు టిడిపిని పాతిపెడతారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకే బాబు యాత్ర అనివిమర్శించారు. బాబు యాత్రలు చేస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. యాత్ర పేరుతో బాబు ప్రజల రక్తం కళ్ల చూస్తున్నారన్నారు. సకల జనుల సమ్మెపై ఏనాడైనా టిటిడిపి నేతలు మాట్లాడారా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+