నష్టనివారణ చర్యల్లో ముఖ్యమంత్రి, ఢిల్లీకి దూత

Kiran Kumar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హైదరాబాదు పర్యటనలో తనకు జరిగిన నష్టాన్ని నివారించుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. తాను ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పార్టీ నాయకులు పలువురు ఫిర్యాదు చేయడంతో అత్మరక్షణలో పడిన కిరణ్ కుమార్ రెడ్డి నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు ఫిర్యాదు చేయగా, తమను గుర్తించడం లేదని పార్టీ నాయకులు చెప్పారు. దీంతో ఆజాద్ పర్యటన కిరణ్ కుమార్ రెడ్డికి తీవ్రమైన తలనొప్పిని తెచ్చిపెట్టింది.

ఆజాద్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా జరిగిన నష్టాన్ని నివారించుకోవడానికి తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ రంగా రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పంపించారు. ఆయన శనివారంనాడు హోం మంత్రి చిదంబరాన్ని కలిసి పరిస్థితిని వివరించారు. రాష్ట్ర పరిస్థితులపై, పార్టీ తీరుపై ఆయన పార్టీ అధిష్టానానికి ఓ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే తనకు వ్యతిరేకంగా పని చేయించారనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తన దూతను ఢిల్లీకి పంపించిన నేపథ్యంలో బొత్స ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తన వాదనను వినిపించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, తాను వ్యక్తిగతమైన పని మీద ఢిల్లీ వెళ్తున్నట్లు బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సమన్వయ కమిటీ కూర్పు పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రమైన ఆసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+