ముదురుతున్న విభేదాలు, మమత హెచ్చరిక

రాయ్గంజ్ సంఘటన దురదృష్టకరమైందని ఆమె అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ విద్యార్థులను రాయ్గంజ్ కళాశాలలో నామినేషన్ వేయకుండా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కొడుతున్నారని, గత 34 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నది ఇదేనని ఆమె అన్నారు. పెట్రోల్ ధరల పెంపును, రిటైల్ రంగంలో ఎఫ్డిఐలను, లోక్పాల్ బిల్లులో లోకాయుక్త క్లాజ్లను తాము వ్యతిరేకించడం వల్ల కాంగ్రెసు తమపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోందని ఆమె అన్నారు. అధికార యంత్రాంగాన్నంతా సిపిఎం రాజకీయమయం చేసిందని ఆమె విమర్శించారు. కాంగ్రెసు సిపిఎంతో కలిసి పనిచేస్తోందని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications