వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల చిటపట!: పదవులపై చిరుకు కొత్త తలనొప్పి

By Srinivas
|
Google Oneindia TeluguNews

chiranjeevi
హైదరాబాద్: మంత్రి పదవుల విషయంలో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయట. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో తమకు మూడు పదవులు కావాలని చిరు అభ్యర్థించినప్పటికీ కాంగ్రెసు అధిష్టానం ససేమీరా అనడంతో రెండు పదవులతోనే చిరు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఆ రెండు పదవులు ఎవరికో ఇప్పటికే దాదాపు తేలి పోయింది. సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులను కిరణ్ కేబినెట్లోకి తీసుకునే అవకాశముంది. ఇన్నాళ్లు కాంగ్రెసు నేతలు వారికి పదవులు అడ్డుకున్నారు. ఇప్పుడు చిరుకు తన వర్గం నుండే తలనొప్పులు వస్తున్నాయట. ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తమ సంగతేమిటని మిగిలిన ఎమ్మెల్యేలు చిరంజీవిని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం.

చిరు వర్గం సీనియర్ నేతలతో పాటు ప్రాంతాల వారిగా ఎమ్మెల్యేలు చిరుపై చిటపటలాడుతున్నారట. రెండు మంత్రి పదవులు కాకుండా మూడు పదవుల కోసం పట్టుబట్టాల్సి ఉండేనని, ఆ ఆ రెండు ఇద్దరికి ఇస్తే మా పరిస్థితి చెప్పండని అడుగుతున్నారట. అంతేకాదు చిరు తన వర్గంలో కొందరికే ప్రాధాన్యం ఇవ్వడంపై కొందరు అలకబూనుతున్నారట. ఇటీవల కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు విందు కోటగిరి ఆధ్వర్యంలోనే ఖరారైనప్పటికీ ఆయనను చిరు ఆహ్వానించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవులు ఆశించిన వారిలో వంగా గీత, కన్నబాబు, బండారు సత్యానందరావులతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో ఎవరికో ఒకరికి ప్రభుత్వ విప్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అలా అయితే మిగిలిన వారు చిరంజీవిపై గుర్రుగా ఉండే అవకాశముంది. ఇప్పటి వరకు తన వర్గం పదవుల కోసం అధిష్టానం వద్ద గట్టిగా పట్టబట్టిన చిరంజీవి ఇక నుండి తన వర్గాన్ని సముదాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
It seems, Chiranjeevi facing new headache from his party leaders with ministry posts. Remaining mlas asking Chiranjeevi about their posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X