వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై బాబుకు కోర్టు షాక్, కేసుకు ఆదేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై రంగారెడ్డి జిల్లా కోర్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చింది. తెలంగాణపై ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై చంద్రబాబు మీద 417 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని రంగా రెడ్డి జిల్లా 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది. తెలంగాణపై మాట మార్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని జనార్దన్ అనే న్యాయవాది తెలంగాణ న్యాయవాదుల తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు విన్న కోర్టు చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

ఫిబ్రవరి 9వ తేదీన చంద్రబాబు తమ ముందు హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తే తమ పార్టీ మద్దతిస్తుందని చంద్రబాబు చెప్పారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేసిన తర్వాత మాట మార్చారని, అర్థరాత్రి రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించారంటూ మాట మార్చారని మమజనార్దన్ తన పిటిషన్‌లో వివరించారు. చంద్రబాబు మాట మార్చడం ద్వారా తెలంగాణలో 700 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమయ్యారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను చంద్రబాబు దెబ్బ తీశారని ఆయన అన్నారు.

English summary
Ranga Reddy district court ordered police to book case aginst TDP president N Chandrababu Naidu on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X