హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను చూస్తే వారికి భయం: నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు భయమని తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. జగన్ అయినా మరెవరైనా రౌడీయిజం చేస్తే తాము సహించేది లేదని ఆయన అన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మిడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్‌ను, నారా చంద్రబాబు నాయుడిని పోల్చుకుంటూ టీడీపీ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు.

జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం చేతగాకపోతే ఇంట్లో కూర్చోండి అంటూ టీడీపీ వారికి ఆయన హితవు పలికారు. చంద్రబాబు చేతిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కీలుబొమ్మలుగా మారారన్నారు. ఉప ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీడీపీకి ఉనికి ఉండదన్న విషయం స్పష్టమై వారికి జ్ఞానోదయమవుతుందన్నారు. తెలుగుదేశం నాయకులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

English summary
Telangana Nagara Samithi leader Nagam Janardhan Reddy said that TDP leaders are fearing about YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X