వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరిచంద్ర యుద్ధం: చంద్రగిరికి హరికృష్ణ డుమ్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Hari Krishna
చిత్తూరు: బావామరుదుల యుద్ధం ఇంకా కొనసాగుతున్నట్లే ఉంది. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య దూరం మరింత పెరిగినట్లు సంకేతాలు అందుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం నారావారి పల్లెలో చంద్రబాబు కుటుంబ సభ్యుల సంక్రాంతికి సంబరాలకు నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జానియర్ ఎన్టీఆర్ రాలేదు. వారిని చంద్రబాబు ఆహ్వానించారో, లేదో కూడా తెలియదు. దీన్నిబట్టి చంద్రబాబుకు, హరికృష్ణకు మధ్య విభేదాలు భగ్గుమంటున్నట్లు చెబుతున్నారు.

కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరీ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, బాలకృష్ణ, తదితరుల ఫోటో ఫ్రేమ్‌లతో కూడిన కటౌట్లు, బ్యానర్లు నారావారి పల్లెలో ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. వాటిలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు లేవు. చంద్రబాబు, హరికృష్ణ మధ్య దూరానికి అది మరింత బలం చేకూరుస్తోంది.

చంద్రబాబు నివాసంలోని పండుగ సంబరాలకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను ఆహ్వానించి ఉండాల్సిందనే అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. గతంలో దూరమైన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసిపోయారు. రామ్మూర్తి నాయుడితో కలిసి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులంతా ఈ సంబరాలకు వచ్చారు.

తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తనకు, తన కుటుంబ సభ్యులకు తగిన స్థానం దక్కడం లేదనే ఉద్దేశంతో హరికృష్ణ ఉన్నారు. పైగా, పార్టీ పగ్గాలను చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు అప్పగించాలనే ప్రయత్నం ఆయన కోపానికి ఆజ్యం పోసింది. లోకేష్‌కు పోటీగా ఆయన తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను నిలబెట్టారు. దీంతో బాలకృష్ణను తనకు మరింత చేరువ చేసుకుని తన వ్యూహాన్ని అమలు చేసే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను ఎదుర్కునే వ్యూహం అందులో ఇమిడి ఉందని అంటున్నారు.

English summary
Both Nara family and Nandamuri clan gathered at Chandrababu Naidu's Naravaripalle village in Chittoor district on Friday to celebrate Sankranti. Nandamuri Harikrishna and his son Jr NTR decided to stay away from the family gathering, indicating the growing cold war between Naidu and Harikrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X